
నిజాంపట్నం, 03 జనవరి (హి.స.)
: బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ వద్ద చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జెట్టీ వద్ద ఆపి ఉంచిన చేపల వేట బోటులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో బోటు నుంచి మత్స్యకారులు కిందికి దూకారు. ఈ ప్రమాదంలో బోటు, వలలు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.20 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా. సముద్రంలో వేటకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ