
తిరువనంతపురం , 13 జూన్ (హి.స.)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ రాజకీయ విధానం ఇండియా కూటమిని ఏ విధంగానూ బలోపేతం చేయకపోగా, బీజేపీకి మేలు చేసేలా ఉంటోందని ఆరోపించారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా లౌకికవాద పార్టీలన్నీ ఏకతాటిపై నిలవాల్సిన తరుణంలో, కాంగ్రెస్ నాయకత్వం తీసుకునే ఇటువంటి చర్యలు కూటమి ఐక్యతను దెబ్బతీస్తాయని తెలిపారు. ఇండియా కూటమి సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ తాను పినరయి విజయన్ను కౌగిలించుకోలేనని చేసిన వ్యాఖ్యలపై విజయన్ తాజాగా స్పందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi