తిరుపతి: 6 అక్టోబర్ (హి.స.)
తిరుపతి ఎస్వీ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. వర్సిటీ సమీపంలో సీఎం చంద్రబాబు పర్యటన కోసం అధికారులు హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ వద్ద 5 ఆర్డీఎక్స్ ఐఈడీ బాంబులు పెట్టినట్లు ఈమెయిల్ వచ్చింది. దీంతో హెలిప్యాడ్ పరిసరాల్లో బాంబు స్క్వాడ్, పోలీసుల విస్తృత తనిఖీలు చేపట్టారు. మంగళవారం సీఎం చంద్రబాబు నారావారిపల్లికి రానున్నారు. (Andhra Pradesh News)
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ