తెలంగాణ, 6 అక్టోబర్ (హి.స.)
20వ జాతీయ ఆర్టీఐ(RTI) వారోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సోమవారం జూబ్లీహిల్స్లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆర్టీఐ నూతన లోగోను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రిని కలిసినవారిలో ఆర్టీఐ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్లు బోరెడ్డి అయోధ్యరెడ్డి, పీవీ శ్రీనివాసరావు, మొహిసినా పర్వీన్, దేశాల భూపాల్, మెర్ల వైష్ణవి ఉన్నారు. కాగా, ఇటీవలే ఆర్టీఐలో ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసిన విషయం తెలిసిందే. కొత్తగా నలుగురు కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు