తెలంగాణ, ఆసిఫాబాద్. 6 అక్టోబర్ (హి.స.)
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో దుర్గా దేవి
నిమజ్జనం సందర్భంగా హిందూ మహిళలు పురుషులపై దాడి చేసిన ఎస్సై వెంటనే చర్యలు తీసుకోవాలని సిర్పూర్ శాసన సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు డిమాండ్ చేశారు. సోమవారం కాగజ్నగర్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్ లో జరిగిన బందుకు భారతీయ పార్టీ జనతా తరపున పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు. జైనూర్ నుండి మొదలుకుని ఆసిఫాబాద్ వరకు అన్ని చోట్ల హిందువులపై అణచివేత అధికమైందని, దీనిని అరికట్టాల్సిన బాధ్యత పోలీసు ఉన్నతాధికారులపై ఉన్నదని గుర్తు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు