టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్ తో ఏపి విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.భేటీ అయ్యారు
ముంబయి ,అమరావతి, 6 అక్టోబర్ (హి.స.): టాటా గ్రూపు ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ) భేటీ అయ్యారు. విశాఖపట్నంలో త్వరలో నిర్వహించనున్న టీసీఎస్ డెవలప్‌మెంట్‌ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని టాటా
టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్ తో ఏపి విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.భేటీ  అయ్యారు


ముంబయి ,అమరావతి, 6 అక్టోబర్ (హి.స.): టాటా గ్రూపు ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ) భేటీ అయ్యారు. విశాఖపట్నంలో త్వరలో నిర్వహించనున్న టీసీఎస్ డెవలప్‌మెంట్‌ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని టాటా గ్రూపు ప్రతినిధులను ఆహ్వానించారు. అలాగే, ఏపీలో జ‌రుగుతోన్న అభివృద్ధిలో టాటా గ్రూపు భాగ‌స్వామ్యం కావాల‌ని, అన్ని రంగాల్లో పెట్టుబ‌డులు పెట్టాల‌ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈవీల ఛార్జింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, రూఫ్‌టాప్‌ సోలార్‌ అభివృద్దిలో కలిసి పనిచేయాలని, సెల్‌, మాడ్యూల్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటును పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖలో టాటా ఎలక్సీ సెంటర్‌ ఏర్పాటు చేయాలని, పలు రంగాల్లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లు ఏర్పాటు ఈ సందర్భంగా కోరారు. శ్రీసిటీలో ఈవీ భాగాలు తయారీ యూనిట్లు స్థాపించాలని కోరారు. భూమి, ప్లగ్‌ అండ్‌ ప్లే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని, ప్రత్యేక ప్రోత్సాహకాలను సైతం ఇస్తుందని భరోసా ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande