నెల్లూరు:7 అక్టోబర్ (హి.స.)
నగరంలో జంట హత్యలు కలకలం రేపాయి. రంగనాయకులపేట తిక్కన పార్కు ప్రాంతంలో ఇద్దరు గుర్తుతెలియని యువకుల దారుణహత్యకు గురయ్యారు. అటుగా వెళ్తున్న స్థానికులు మృతదేహాలను చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రైమ్ స్పాట్ను పరిశీలించారు. ఇద్దరు యువకులని దుండగులు కర్రలతో కొట్టిచంపి, పెన్నానదిలో పడేసినట్లు పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ