అమరావతి, 7 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసింది. ఈ మేరకు మోహిత్ రెడ్డి పిటిషన్పై ఇవాళ(మంగళవారం) విచారణ జరిగింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. సుదీర్ఘ వాదనల అనంతరం ఇవాళ ముందస్తు బెయిల్ పిటీషన్ను హైకోర్టు కొట్టివేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ