శ్రీశైలం , 7 అక్టోబర్ (హి.స.)శ్రీశైలం రిజర్వాయర్ ఈ సీజన్లో రికార్డులను తిరగరాసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక నీటిని స్వీకరించి, దిగువకు విడుదల చేసింది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు ఈ సీజన్లో ఇప్పటివరకు 1578 టీఎంసీల నీరు విడుదలైనట్లు అధికారులు తెలిపారు. కృష్ణ, తుంగభద్ర, హంద్రీ వంటి నదుల నుండి రిజర్వాయర్కు మొత్తం 2105 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ఈ వరద ప్రవాహం ఇంకా కొనసాగుతోంది. ఈ సీజన్లో మరో 100 టీఎంసీల వరకు నీరు వచ్చి చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారీగా వచ్చి చేరిన ఈ నీటిలో తాగునీటి, సాగునీటి అవసరాలు తీరగా, దిగువన ఉన్న నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్లను దాటుకుంటూ వందల టీఎంసీల నీరు సముద్రంలోకి ప్రవహించి పోతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV