నేడు వైసీపీ కీలక నేతలతో జగన్ భేటీ... ఈ అంశాలే ప్రధాన అజెండా!
తాడేపల్లి, 5 అక్టోబర్ (హి.స.) కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై తొలిసారిగా ప్రత్యక్ష పోరుకు సిద్ధమవుతున్న వైసీపీ అందుకు సంబంధించిన వ్యూహరచనపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై
జగన్


తాడేపల్లి, 5 అక్టోబర్ (హి.స.)

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై తొలిసారిగా ప్రత్యక్ష పోరుకు సిద్ధమవుతున్న వైసీపీ అందుకు సంబంధించిన వ్యూహరచనపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. పార్టీ ముఖ్య నేతలతో నేడు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీని బలోపేతం చేయడం, ప్రభుత్వ విధానాలపై పోరాటం వంటి అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు.

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో 1 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిశీలకులు హాజరుకానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పబ్లిక్‌-ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 9వ తేదీన రాష్ట్రవ్యాప్త ఆందోళనకు వైసీపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పోరును ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ప్రజలను ఏ విధంగా సమీకరించాలనే దానిపై జగన్ నేతలతో చర్చించే అవకాశం ఉంది.

---------------

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande