కర్నూలు, 8 అక్టోబర్ (హి.స.)నిమ్మరసం, చియా విత్తనాలు కలిపి తీసుకోవటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఎందుకంటే విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మకాయ నీరు శరీరాన్ని చల్లబరుస్తుంది. హైడ్రేటెడ్గా ఉంచుతుంది. చియా విత్తనాలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, భాస్వరం, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. చియా విత్తనాలతో కలిపి నిమ్మరసం తాగడం వల్ల కలిగే మరిన్ని లాభాలు ఇక్కడ చూద్దాం..
నిమ్మకాయ చియా సీడ్స్ కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. నిమ్మకాయ చియా విత్తనాల పానీయం ఒక అద్భుతమైన కడుపుకు సంబంధించిన సమస్యలకు నివారణ. ఇది గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం, మలబద్ధకం వంటి కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది .
చియా విత్తనాలను నిమ్మకాయ నీటితో కలిపి తాగడం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. గుండెపోటు, స్ట్రోక్ మరియు గుండె వైఫల్యం వంటి గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
విటమిన్ సి, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలతో సమృద్ధిగా ఉన్న నిమ్మకాయ చియా పానీయం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, ఫ్లూ, జ్వరం, దగ్గు, అలెర్జీలు వంటి ఇన్ఫెక్షన్ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడంలో సహాయపడుతుంది.
పిక.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV