
తిరుమల, 15 నవంబర్ (హి.స.)
: తిరుమల తిరుపతి దేవస్థానానికి పుణెకు చెందిన పినాకిల్ మొబిలిటి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా ఇచ్చింది. రూ.74.24 లక్షల విలువైన విద్యుత్ బస్సును శనివారం తితిదేకు అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయం ఎదుట బస్సు తాళాలను డిప్యూటీ ఈవోకు అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ