
పెద్దపల్లి, 15 నవంబర్ (హి.స.)
పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేసే విధంగా జిల్లా అధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శనివారం జిల్లా సమీకృత కలెక్టరేట్లో పాఠశాలల పర్యవేక్షణ, ప్రభుత్వ బ్యాంక్ ఖాతాల నిర్వహణ పై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ శాఖలలో వినియోగించని బ్యాంకు ఖాతాలలో జమ చేసి ఉన్న ఆర్ బీఐ(RBI) నుంచి వెనక్కి తీసుకునేందుకు కేవైసీ వివరాలు, రిక్వెస్ట్ లెటర్(request letter) సంబంధిత శాఖలు అందించాలని సూచించారు. నవంబర్ 22 నాటికి పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ శాఖల పరిధిలో ఉపయోగించని బ్యాంకు ఖాతాల నుంచి ఆర్ బీఐ ఫ్రీజ్ చెసిన డబ్బులు వెనక్కి తీసుకునేందుకు కార్యచరణ పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు