
బూచేపల్లి , 15 నవంబర్ (హి.స.) ప్రకాశం జిల్లా దర్శి వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి(Darshi YCP MLA Buchepalli Sivaprasad Reddy)పై పోలీసులు కేసు నమోదు చేశారు. మెడికల్ కాలేజీల(Medical Colleges)కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి తీసుకోలేదు. దీంతో పోలీసులు సీరియస్ అయ్యారు. బూచేపల్లి శివప్రసాద్తో పాటు మరో 30 మంది వైసీపీ కార్యకర్తలపైనా కేసులు నమోదు చేశారు. ర్యాలీకి అనుమతులు లేనందున కేసులు నమోదు చేసి చేసినట్లు తెలిపారు. దర్శిలో శాంతి భద్రతల దృష్ట్యా ర్యాలీలు, నిరసనలు, ధర్నాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని అన్ని పార్టీలకు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV