
హైదరాబాద్, 30 నవంబర్ (హి.స.) టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్
శర్మ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో అతను ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్కు ముందు రోహిత్ ఈ ఘనత సాధించడానికి మూడు సిక్సర్ల దూరంలో ఉన్నాడు. మ్యాచ్లో మూడు సిక్సర్లు బాది.. పాకిస్తాన్ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిదిని అధిగమించాడు.
దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..