దిల్లీ: , 12 జూన్ (హి.స.)సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని గత 11 ఏళ్లలో ప్రజలు అపరిమిత ప్రయోజనాలు పొందారని ప్రధాని మోదీ (PM Modi) తెలిపారు. చివరి లబ్ధిదారుడికి కూడా సకాలంలో పథకాలు చేరినట్లు చెప్పారు. అదీ.. సాంకేతికతకు ఉన్న శక్తి అని కొనియాడారు. ‘‘యువశక్తి అండతో సరికొత్త ఆవిష్కరణలు చేస్తూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ భారత్ అద్భుత పురోగతి సాధిస్తోంది. ఇది భారత్ ప్రపంచ సాంకేతిక శక్తి కేంద్రంగా ఎదుగుతోందని చెప్పేందుకు మరింత బలం చేకూరుస్తోంది’’ అని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ప్రభుత్వ సేవలను అత్యంత కచ్చితత్వంతో పారదర్శకంగా అందించేందుకు సాంకేతికత దోహదం చేస్తోందని చెప్పారు. అంతేకాకుండా పేదల జీవితాలను మెరుగుపరిచే సాధనంగా మారిందన్నారు. ప్రభుత్వ అధికారిక ఎక్స్ హ్యాండిల్ లోని పలు పోస్టులను ఉటంకిస్తూ.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా పారదర్శకతను తీసుకొచ్చామని అందుకు సాంకేతికతే కారణమని తెలిపారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు