దిల్లీ: , 12 జూన్ (హి.స.)ఝార్ఖండ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలోని ఏడు జిల్లాల మీదుగా వెళ్లే రెండు రైల్వే ప్రాజెక్టులకు రూ.6,405 కోట్లు కేటాయించాలని ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశం నిర్ణయించింది. దీనిలో కోడర్మా-బర్కాకానా మార్గం (133 కి.మీ.) డబ్లింగ్ ఒకటి. రెండోది బళ్లారి-చిక్జాజుర్ (185 కి.మీ.) జంటమార్గం పని. ఇది కర్ణాటకలోని బళ్లారి, చిత్రదుర్గ జిల్లాలు, ఏపీలోని అనంతపురం జిల్లాలో కొంత భాగం మీదుగా వెళ్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు