తోతాపురి మామిడిపై ఏపీ నిషేధం.. తక్షణమే ఎత్తివేయాలని కర్ణాటక డిమాండ్
బెంగళూరు, 12 జూన్ (హి.స.)కర్ణాటక నుంచి తోతాపురి మామిడి పండ్ల దిగుమతిపై ఏపీ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఏపీ సీఎం చంద్రబాబుకు ఈరోజు అధికారికంగా లేఖ రాశారు. ఒకవేళ ఈ ఆంక్షలు
తోతాపురి మామిడిపై ఏపీ నిషేధం.. తక్షణమే ఎత్తివేయాలని కర్ణాటక డిమాండ్


బెంగళూరు, 12 జూన్ (హి.స.)కర్ణాటక నుంచి తోతాపురి మామిడి పండ్ల దిగుమతిపై ఏపీ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఏపీ సీఎం చంద్రబాబుకు ఈరోజు అధికారికంగా లేఖ రాశారు. ఒకవేళ ఈ ఆంక్షలు కొనసాగితే, కర్ణాటక కూడా ప్రతీకార చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆ లేఖలో ఆయన హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ వివాదం కారణంగా కర్ణాటకలోని మామిడి రైతులు, ముఖ్యంగా ఏపీ సరిహద్దు ప్రాంతాల్లోని వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వీరంతా చిత్తూరు జిల్లాలోని విస్తృతమైన మామిడి ప్రాసెసింగ్ పరిశ్రమపై ఎక్కువగా ఆధారపడి జీవిస్తున్నారు.

సీఎం చంద్ర‌బాబుకు రాసిన లేఖలో ఈ నిషేధం సహకార సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు కర్ణాటక నుంచి కూడా ప్రతిస్పందన చర్యలకు దారితీసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చ‌రించారు. మార్కెటింగ్ మార్గాలు మూసుకుపోవడం వల్ల వేలాది మంది మామిడి రైతుల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని, పంట కోతల అనంతరం భారీ నష్టాలు వాటిల్లుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande