ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ@25,100
ముంబయి12 జూన్ (హి.స.) దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ మదుపర్లు కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్
ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ@25,100


ముంబయి12 జూన్ (హి.స.) దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ మదుపర్లు కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 72 పాయింట్ల లాభంతో 82,596 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ (Nifty) 30 పాయింట్ల లాభంతో 25,172 వద్ద ఉన్నాయి.

సెన్సెక్స్‌ 30 సూచీలో.. ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ఫిన్‌సర్వ్‌, సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ఫైనాన్స్‌, యాక్సిస్ బ్యాంక్‌, మారుతీ సుజుకీ, అదానీ పోర్ట్స్ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇన్ఫోసిస్‌, ఎటర్నల్‌, టెక్‌మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టాటా మోటార్స్, టాటా స్టీల్‌, ఎంఅండ్‌ఎం, ఐటీసీ, టీసీఎస్‌, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 85.46 వద్ద ప్రారంభమైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande