హైదరాబాద్, 13 జూన్ (హి.స.)
గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా
సింగ్ పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐకి వారు లేఖ రాశారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయ లక్ష్మీకి బెదిరింపు కాల్ వస్తే ఇమీడియట్ గా ఆ ఫోన్ చేసిన వ్యక్తిని అరెస్టు చేస్తారు.. కానీ, ఒక్క సిట్టింగ్ ఎమ్మెల్యేకి బక్రీదు పండగ కంటే ముందు నుంచి ఇప్పటి వరకు వందల ఫోన్ కాల్స్.. వేరే వేరే నంబర్ల నుంచి బెదిరింపు కాల్ వస్తే మాత్రం ఒక్క ఎఫ్ఎఆర్ నమోదు చేసేందుకు ఆలోచన చేస్తున్న పోలీస్ అధికారులు అని మండిపడ్డారు. మాకు ఫోన్ చేసి బెదిరిస్తున్న ఆ వ్యక్తిని అరెస్టు చేయరా అని ప్రశ్నించారు. ఇలా చేయడం దేని సంకేతం.. అంటే, నేను బిజెపిలో ఉన్నందు కేనా ఈ చిన్నచూపు చూస్తున్నారు పోలీసు అధికారులు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల కోట్ల రూపాయలు పెట్టి పోలీస్ కమాండ్ కంట్రోల్ కట్టారు కదా.. అది టైం పాస్ గురించి కట్టారా అని మండిపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..