హైదరాబాద్, 14 జూన్ (హి.స.)
రాష్ట్రంలో గత పదేళ్లుగా నిలిచిపోయిన సినిమా అవార్డుల ప్రదానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దర్ పేరిట అవార్డులను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ చలనచిత్ర రంగానికి గుర్తింపు కల్పిస్తూ, 2024లో విడుదలైన చిత్రాలకు గద్దర్ అవార్డులు ప్రకటించగా, గత పదేళ్లలో వచ్చిన చిత్రాల నుంచి ప్రతి ఏడాది మూడు ఉత్తమ చిత్రాలకూ అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఇప్పటికే అవార్డు విజేతలను జ్యూరి సభ్యులు ప్రకటించారు.. ఇక ఈ అవార్డుల ప్రదానోత్సవం నేటి సాయంత్రం హైటెక్స్ వేదికగా జరుగనుంది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి దితరులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్