హైదరాబాద్, 13 జూన్ (హి.స.)
తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. శేరిలింగంపల్లి నియోజకవర్గం గోపన్పల్లిలో భూ వివాదానికి సంబంధించిన వ్యవహారంలో ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్