తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల, 14 జూన్ (హి.స.)తిరుమల (Tirumala) శ్రీవారి కొండపై భారీగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారంతం కావటంతో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌(Vaikuntam Q Complex)లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. వెలుపల క్యూ లైన్‌లోనూ భక్త
తిరుమల


తిరుమల, 14 జూన్ (హి.స.)తిరుమల (Tirumala) శ్రీవారి కొండపై భారీగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారంతం కావటంతో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌(Vaikuntam Q Complex)లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. వెలుపల క్యూ లైన్‌లోనూ భక్తులు వేచిఉన్నారు. దీంతో శనివారం శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శుక్రవారం అర్థరాత్రి వరకు స్వామివారిని 75,096 మంది భక్తులు దర్శించుకోగా, 36,262 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ(Srivari Hundi) ఆదాయం రూ.3.93 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఒక భక్తుల రద్దీని బట్టి సమయాలు మారుతాయని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande