సంపన్నమైన రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిన కేసీఆర్.. సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని
సిద్దిపేట, 13 జూన్ (హి.స.) సిద్దిపేట మాజీ ఎమ్మెల్యే ఎడ్ల గురువా రెడ్డి 14 వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్
సిపిఐ ఎమ్మెల్యే


సిద్దిపేట, 13 జూన్ (హి.స.) సిద్దిపేట మాజీ ఎమ్మెల్యే ఎడ్ల గురువా రెడ్డి 14 వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు..

ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులతో చర్చలు నడిపేందుకు సిద్ధంగా ఉంది.. కానీ నక్సలైట్స్ తో చర్చలకి ముందుకు రావడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టులను ఉగ్రవాదుల కంటే దారుణంగా మోడీ సర్కార్ చూస్తుందని విమర్శలు గుప్పించారు.

ఇక, కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజనీర్స్ దే పాత్ర ఉందని తమకు ఏం తెలియదని అనడం సరికాదు అని తెలిపారు. కేసీఆర్ సంపన్నమైన రాష్ట్రాన్ని కాళేశ్వరం కట్టి అప్పుల రాష్ట్రంగా మార్చారు అని ఆరోపించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande