హైదరాబాద్, 13 జూన్ (హి.స.)
ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ ను బడిలో చేర్చనున్నారు.. ఈ నేపథ్యంలోనే ఆయన నేడు పటాన్ చెరు లోని ఇక్రిశాట్ స్కూల్ కి వచ్చారు.. అడ్మిషన్ పై స్కూల్ అధికారులతో ఆయన చర్చించారు.. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ విద్య బోధిస్తుండటంతో పవన్ ఈ స్కూల్ ను ఎంచుకున్నట్లు సమాచారం . ఇక పాఠశాలకు వచ్చిన పవన్ కు స్కూల్ సిబ్బంది సాదారపూర్వకంగా స్వాగతం పలికారు. కాగా ఇ టీవల సింగపూర్ పాఠశాలలో అగ్ని ప్రమాదంలో గాయపడ్డ మార్క్ శంకర్ చికిత్స అనంతరం కోలుకున్నాడు ..
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్