హైదరాబాద్, 13 జూన్ (హి.స.)
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పల్లా రాజేశ్వర్ రెడ్డితో మాట్లాడి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కేటీఆర్ తెలుసుకున్నారు.
శస్త్ర చికిత్స అనంతరం తొందరగానే కోలుకుంటున్నట్లుగా కేటీఆర్తో పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి వేగంగా కోలుకుని, త్వరలోనే తిరిగి ప్రజాక్షేత్రంలో యథావిధిగా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. కాగా, రెండు రోజుల క్రితం ఎర్రవల్లి వ్యవసాయ క్షేతంలోని బాత్రూంలో జారిపడటంతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎడమ కాలి తొడ ఎముక ఫ్రాక్చర్ అయిన సంగతి తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్