తెలంగాణ, మేడ్చల్ మల్కాజ్గిరి. 13 జూన్ (హి.స.)
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నూతన కలెక్టర్ గా మిక్కిలినేని మనుచౌదరి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. పాత కలెక్టర్ గౌతం పొట్రూ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గురువారం సాయంత్రం మనుచౌదరిని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.దీంతో మిక్కిలినేని మనుచౌదరి జిల్లా కలెక్టరేట్ ఛాంబర్ లో గౌతం పొట్రూ నుంచి బాధ్యతలు స్వీకరించారు.
ముందుగా కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థాన అర్చకులు కొత్త కలెక్టర్ కు వేదోచ్చరణ మంత్రాలతో కలెక్టరేట్ లో పూర్ణకుంభ స్వాగతం పలికారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు