మంత్రులకు స్వాగతం పలికిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్
తెలంగాణ, పెద్దపల్లి. 13 జూన్ (హి.స.) పెద్దపల్లి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వచ్చిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పెద్దప
పెద్దపల్లి


తెలంగాణ, పెద్దపల్లి. 13 జూన్ (హి.స.)

పెద్దపల్లి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వచ్చిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పెద్దపల్లి వచ్చారు. కాగా వారికి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా గత ప్రభుత్వం అమలు చేశామని చెప్పుకుంటున్న కార్యక్రమాలు వేటిని పక్కన పెట్టకుండా అదనంగా కొత్త సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రభుత్వంలో దొరవారు చేసిన అప్పులకు అసలు వడ్డీ కలిపి ప్రతి నెల రూ.6500 కోట్లు కడుతున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల్లా పరుగులు పెట్టిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో నలుగురు వ్యక్తులు తమ స్వార్థం కోసం ధరణిని తీసుకువచ్చారు. దీంతో ప్రజలను హింసపెట్టారు. కానీ మేమొచ్చాక ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేశామని దాని స్థానంలో అద్భుతమైన భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని చెప్పారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande