సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాదిగ ఎమ్మెల్యేలు
హైదరాబాద్, 13 జూన్ (హి.స.) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో నేడు మాదిగ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. మంత్రివర్గంలో తమ సామాజిక వర్గానికి చోటు కల్పించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ శాలువాతో సత్కరించారు. ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణలో
మాదిగ ఎమ్మెల్యేలు


హైదరాబాద్, 13 జూన్ (హి.స.)

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో నేడు మాదిగ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. మంత్రివర్గంలో తమ సామాజిక వర్గానికి చోటు కల్పించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ శాలువాతో సత్కరించారు. ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణలో మాదిగ సామాజికి వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ కు అవకాశం దక్కింది. ఆయనకు ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమం, మైనార్టీ సంక్షేమం, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ లు, ట్రాన్స్ జెండర్స్ శాఖలను అప్పగించారు. అంతకు ముందు తమ సామాజికి వర్గానికి కేబినెట్ విస్తరణలో అవకాశం ఇవ్వాలని మాదిగ ఎమ్మెల్యేలు పలు సార్లు సీఎంను భేటీ అయ్యారు. అందుకు అనుగుణంగా మంత్రివర్గ విస్తరణలో వివేక్, వాకిటి శ్రీహరితో పాటు మాదిగ సమాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ కు చోటు దక్కింది. ఈ నేపథ్యంలో అడ్లూరి లక్ష్మణ్ సహా పలువురు మాదిగ సామాజిక ఎమ్మెల్యేలు ఇవాళ సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలే యాదయ్య, జూపల్లి కృష్ణారావు తదితరులు ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande