కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మి 20 రోజులైనా ఖాతాల్లో డబ్బులు పడలే.. రైతుల ఆవేదన
తెలంగాణ, నిర్మల్. 13 జూన్ (హి.స.) ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ తమ ఖాతాలలో డబ్బులు జమ కాలేదని నిర్మల్ జిల్లా బైంసా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే డబ్బులు చెల్లించాలన
నిర్మల్ జిల్లా రైతులు


తెలంగాణ, నిర్మల్. 13 జూన్ (హి.స.) ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ తమ ఖాతాలలో డబ్బులు జమ కాలేదని నిర్మల్ జిల్లా బైంసా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే డబ్బులు చెల్లించాలని కోరుతున్నారు. వర్షాకాలం పంట పెట్టుబడికి డబ్బులు ఎక్కడినుంచి తీసుకురావాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తానన్న ప్రభుత్వం పూర్తిగా ధాన్యాన్ని కొనుగోలు చేయకుండానే కేంద్రాలను ఎత్తివేసిందని విమర్శించారు. ఒక్కసారి అధికారులు, నాయకులు తమ గ్రామానికి వస్తే తామెంత నష్టపోయామో తెలుస్తుందన్నారు. ఇప్పటికీ ధాన్యం కొనేవారు లేక రహదారులపైనే రాశులుగా పడి ఉందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande