హైదరాబాద్, 13 జూన్ (హి.స.)రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్యలోని స్థిరాస్తి లావాదేవీలపై రిజిస్ట్రేషన్ మార్కెట్ ధరలను పెంచాలని యోచిస్తోంది. అపార్ట్మెంట్స్పై 30శాతం, ఓపెన్ ప్లాట్లపై వంద శాతం, అంతకంటే ఎక్కువ పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. మార్కెట్ విలువల మార్గదర్శక నియమాల ప్రకారం ముందుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు