అమరావతి, 13 జూన్ (హి.స.)
అమరావతి: ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్తున్నారు. 2010 బ్యాచ్కు చెందిన ఆర్థికశాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్న జె.నివాస్ .. జనగణన కార్యకలాపాల డైరెక్టర్గా నియమితులయ్యారు. 2011 బ్యాచ్కు చెందిన రిజిస్ట్రేషన్, స్టాంపులశాఖ ఐజీగా ఉన్న ఎం.హరినారాయణన్.. న్యూదిల్లీలో తాగునీరు, పారిశుద్ధ్య విభాగం డైరెక్టర్గా నియమితులయ్యారు. వీరిద్దరినీ వెంటనే రిలీవ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. జె.నివాస్ వెళ్లడంతో ఖాళీ అయిన ఆర్థికశాఖ అదనపు కార్యదర్శి నియామకానికి చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్గా ఉన్న వీరపాండియన్కు రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఐజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ ఆదేశాలిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ