ఉత్తరాఖండ్, 21 జూన్ (హి.స.)
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు యోగాసనాలు వేస్తున్నారు. భారత్ వ్యాప్తంగా కూడా యోగా డేని ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పాఠశాలలు, కార్యాలయాల్లో యోగా వేడుకలను నిర్వహిస్తున్నారు. ఆయా వేడుకల్లో పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నిర్వహించిన యోగా డే వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి యోగాసనాలు వేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..