దిల్లీ, 23 జూన్ (హి.స.): ఇంగ్లండ్లోని బర్మింగ్హాం నుంచి దిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో దారి మళ్లించారు. శనివారం ఈ ఘటన జరగగా ఆ విమానం సౌదీ అరేబియాలోని రియాద్లో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు విమానయాన సంస్థ ఆదివారం ప్రకటించింది. అక్కడి నుంచి ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించింది. మరోవైపు పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కొన్ని సర్వీసులు రద్దవుతున్నాయని లేదా ఆలస్యమవుతున్నాయని ఎయిరిండియా తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు