గ్యాస్‌ టెన్షన్‌ మొదలైంది.
ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం
The tricolor of the Air Forces Suryakiran team fluttered in the sky of Jamnagar on the occasion of Republic Day


ఢిల్లీ, 23 జూన్ (హి.స.)

: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం కారణంగా మన వంటింట్లో గ్యాస్‌ బాంబ్‌ పేలి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో హర్మూజ్‌ జల సంధి మూత పడితే భారత్‌కు ఎల్‌పీజీ స్ట్రోక్‌ తగిలే ప్రమాదం ఉంది. వంట ‍గ్యాస్‌ సరఫరాకు ఆటంకం కలిగే అవకాశముంది. దేశీయ అవసరాలకు మన వద్ద 15-16 రోజుల వరకే రిజర్వ్‌లు ఉన్నట్టు సమాచారం. దీంతో, గ్యాస్‌ టెన్షన్‌ మొదలైంది.

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడుల కారణంగా ప్రపంచ దేశాలపై మరో భారం పడనుంది. వంట గ్యాస్‌ సిలిండర్‌ మరింత భారం కానుంది. హర్మూజ్‌ జల సంధి మూత పడితే భారత్‌కు ఎల్‌పీజీ కష్టాలు రానున్నాయి. ప్రస్తుతానికి ఎల్‌పీజీ అవసరాల్లో భారత్‌కు అధిక శాతం పశ్చిమాసియా నుంచే దిగుమతి జరుగుతోంది. దేశంలో 60 శాతం గ్యాస్‌ దిగుమతుల ద్వారానే వస్తోంది. సౌదీ, యూఏఈ, ఖతార్‌ నుంచి భారత్‌కు 95 శాతం ఎల్‌పీజీ దిగుమతులు జరుగుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande