పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
ముంబై, 23 జూన్ (హి.స.) దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. అగ్రరాజ్యం అమెరికా ఇరాన్లోని మూడు అణుకేంద్రాలపై మిస్సైళ్లతో విరుచుకుపడింది. అమెరికా దాడుల ప్రభావం మార్కెట్పై పడింది. మదు
స్టాక్ మార్కెట్


ముంబై, 23 జూన్ (హి.స.)

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం

నష్టాల్లో ముగిశాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. అగ్రరాజ్యం అమెరికా ఇరాన్లోని మూడు అణుకేంద్రాలపై మిస్సైళ్లతో విరుచుకుపడింది. అమెరికా దాడుల ప్రభావం మార్కెట్పై పడింది. మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఫలితంగా మార్కెట్లు పతనమయ్యాయి. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 81,704.07 పాయింట్ల వద్ద సెన్సెక్స్ నష్టాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 82,169.67 పాయింట్ల గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్.. అత్యల్పంగా 81,476.76 పాయింట్లకు పడిపోయింది. చివరకు 511.38 పాయింట్ల నష్టంతో 81,896.79 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 140.50 పాయింట్లు తగ్గి 24,971.90 వద్ద స్థిరపడింది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande