హైదరాబాద్, 23 జూన్ (హి.స.)
దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయి. గుజరాత్లో రెండు స్థానాలకు బైపోల్స్ జరిగాయి. విశావదర్, కడి రెండు స్థానాలకు కౌంటింగ్ నిర్వహించారు. తాజా ఫలితాల్లో బీజేపీ ఒకటి, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కొక్క స్థానాన్ని గెలుచుకున్నాయి. ఇక కేరళలోని నీలంబర్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పంజాబ్లోని లూథియానా వెస్ట్, పశ్చిమ బెంగాల్లోని కలిగంజ్ స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో జూన్ 19న పోలింగ్ జరిగింది.
సోమవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి ఆయా పార్టీల అభ్యర్థులు విజయం దిశగా సాగిపోయారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు