పులివెందుల, 23 జూన్ (హి.స.):వైఎస్ జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేక హత్యకేసు ( )లో ఏ2 నిందితుడు () సునీల్ కుమార్ ఫిర్యాదు () కేసుకు సంబంధించి పులివెందుల పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం సునీల్ కుమార్ తన కుటుంబంతో కలిసి కారులో వెళుతుండగా కొందరు యువకులు వెంబడించి దాడికి యత్నించారంటూ సునీల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి, విచారించిన అనంతరం పవన్ కుమార్, లోకేష్ రెడ్డిలతో పాటు మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పవన్ కుమార్, లోకేష్ రెడ్డిలు ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులుగా గుర్తించారు. కాగా ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులవల్ల తనకు ప్రాణహాని ఉందని ఇప్పటికే ఎస్పీ, పులివెందుల పోలీసులకు పలుమార్లు సునీల్ కుమార్ యాదవ్ ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం బెయిల్పై వచ్చి పులివెందులలో ఉంటున్నాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ