భారత్ అసలు సిసలైన హీరో శ్యామ ప్రసాద్ ముఖర్జీ : బండి సంజ‌య్
తెలంగాణ, కరీంనగర్. 23 జూన్ (హి.స.) భారతదేశ అసలు సిసలైన హీరో శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. ఒకే దేశం.. ఒకే జెండా.. ఒకే రాజ్యాంగం ఉండాలని పరితపించడమే కాకుండా 370 ఆర్టికల్ రద్దు కోసం బలిదానమయ్యారని తెల
బండి సంజయ్


తెలంగాణ, కరీంనగర్. 23 జూన్ (హి.స.) భారతదేశ అసలు సిసలైన హీరో శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. ఒకే దేశం.. ఒకే జెండా.. ఒకే రాజ్యాంగం ఉండాలని పరితపించడమే కాకుండా 370 ఆర్టికల్ రద్దు కోసం బలిదానమయ్యారని తెలిపారు. తన జీవిత సర్వస్వం సిద్ధాంతానికే అంకితం చేయడమే కాకుండా ఆ సిద్ధాంతం కోసం అధికార పదవులను కూడా త్రుణప్రాయంగా త్యజించిన మహనీయుడు శ్యామప్రసాద్ ముఖర్జీ అని స్మరించుకున్నారు. ఈరోజు శ్యామప్రసాద్ ముఖర్జీ వర్దంతి సందర్భంగా బండి సంజయ్ కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అంతకుముందు తన మాతృమూర్తితో కలిసి మొక్కను నాటారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande