హైదరాబాద్, 23 జూన్ (హి.స.)
రైతు భరోసా నిధుల విడుదల నేపథ్యంలో.. మంగళవారం సాయంత్రం 4 గంటలకు అన్ని మండల కేంద్రాల్లో రైతు భరోసా సంబరాలను పెద్ద ఎత్తున చేపట్టాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచించారు. గాంధీభవన్లో సోమవారం టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్యక్షతన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కో ఆర్డినేటర్ల సమావేశంలో భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా 9 రోజుల్లో రూ. 9 వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు విడుదల చేశామని తెలిపారు. ఇప్పటివరకు కోటి 49 లక్షల 39 వేల 111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని అన్నారు. ఎకరాకు రూ.12 వేల చొప్పున అన్ని వ్యవసాయ భూములకు అందించామన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్