హైదరాబాద్, 23 జూన్ (హి.స.)
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రికి ఆలయం ఈవో శ్రీనివాసరావు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి శ్రీ స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మవారికి నిర్వహించుకున్నారు. కుంకుమార్చన దర్శనంతరం పూజలు అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయం ఈవో శ్రీనివాసరావు శ్రీ స్వామి అమ్మవార్ల చిత్రపటం, తీర్థ ప్రసాదాలను మంత్రికి అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..