జగిత్యాల, 23 జూన్ (హి.స.) జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సముదాయంలో నేడు ఓ
ఏఎస్సైకు ప్రమాదం జరిగింది. సోమవారం ప్రజావాణి సందర్భంగా విధులకు హాజరైన ఏఎస్సై ఎండీ అజీజుద్దిన్ ప్రమాదవశాత్తు కిందపడ్డారు. అడిషనల్ కలెక్టర్ కు వచ్చిన ఓ దరఖాస్తు తీసుకునే క్రమంలో అజీజుద్దిన్ మెట్లు ఎక్కుతూ స్లిప్ అయి కిందపడ్డారు. దీంతో ఆయన తీవ్రమైన నొప్పితో విలవిలలాడారు. గాయపడిన ఏఎస్సైని అక్కడే ఉన్న ఇతర సిబ్బంది 108 అంబులెన్సులో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..