అమరావతి, 23 జూన్ (హి.స.):ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు ) దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేసి.. వారిని విచారిస్తున్నారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి y) సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో ఈనెల 25న సిట్ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ