గుంటూరు, 23 జూన్ (హి.స.):జిల్లాలోనితెనాలిలోసంచలనం సృష్టించిన ఇద్దరు వృద్ధ మహిళల హత్య కేసును పోలీసులు చేధించారు. స్కెచ్ వేసి మరీ బంగారం, నగదు కోసం వృద్ధురాళ్లను నిందితులు దారుణంగా హత్య చేసినట్లు విచారణలో బయటపడింది. హత్యకు పాల్పడిన పెరవలి కుసుమ కుమారి, ఇల్ల గోపి, మరో మైనర్ బాలుడిని త్రీ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. జంట హత్యల కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా మరో హత్య కేసు వెలుగులోకి వచ్చింది. గతంలో బంగారం కోసం మారిస్ పేటకు చెందిన మహిళను మహిళా నిందితురాలు హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ