న్యూఢిల్లీ, 24 జూన్ (హి.స.)
ఇరాన్ కీలక ప్రకటన చేసింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. ఈ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చే ముందు ఇజ్రాయెల్పై చివరి క్షిపణి ప్రయోగించినట్లు వెల్లడించింది. ఇరాన్ ప్రకటనతో ఇజ్రాయెల్తో 12 రోజులుగా సాగిన యుద్ధం ముగిసింది.మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. యుద్ధం ముగిసిందంటూ ట్రూత్లో పోస్టు పెట్టారు. 12 రోజుల యుద్ధానికి ముగింపు అని పేర్కొన్నారు. ‘అందరికీ అభినందనలు. ఇజ్రాయెల్, ఇరాన్లు పూర్తి కాల్పుల విరమణకు అంగీకరించాయి.మరో ఆరు గంటల్లో చర్యలు ప్రారంభం కానున్నాయి. 12 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగియనుంది. తొలుత ఇరాన్ కాల్పుల విరమణను ప్రారంభిస్తుంది. ఇజ్రాయెల్ దానిని అనుసరిస్తుంది. దీంతో 12 రోజుల యుద్ధం ముగియనుందని పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..