268 మంది భారతీయులతో ఢిల్లీకి చేరుకున్న మూడో విమానం..
న్యూఢిల్లీ, 24 జూన్ (హి.స.) ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వార్ కారణంగా అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని రప్పించేందుకు కేంద్రం ''ఆపరేషన్ సింధు'' చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు స్వదేశానికి చేరుకున్నారు. తాజాగా ఇజ్రాయెల్ నుంచి మూడో వ
మూడో విమానం


న్యూఢిల్లీ, 24 జూన్ (హి.స.) ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వార్ కారణంగా అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని రప్పించేందుకు కేంద్రం 'ఆపరేషన్ సింధు' చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు స్వదేశానికి చేరుకున్నారు.

తాజాగా ఇజ్రాయెల్ నుంచి మూడో విమానం ఢిల్లీకి చేరుకుంది. ఇందులో 268 మంది భారతీయులు స్వదేశానికి సురక్షితంగా తిరిగొచ్చారు. ఈజిప్టులోని షర్మ్-ఎల్-షేక్ నుంచి బయల్దేరిన ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన సీ-17 విమానం ఈరోజు ఉదయం 11 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. స్వదేశానికి తిరిగొచ్చిన వారికి కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ స్వాగతం పలికారు. ఇక ఆపరేషన్ సింధులో భాగంగా ఇప్పటి వరకూ 594 మంది భారతీయులు ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande