భారత్ కు శాంతి విలువేంటో తెలుసు.. త్రివిధ దళాలపై అదానీ ప్రశంసలు
న్యూఢిల్లీ, 24 జూన్ (హి.స.) ఆపరేషన్ సిందూర్, అహ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ గుర్తుచేసుకున్నారు. అదానీ ఎంటర్ప్రైజెస్ వార్షిక సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ కు శాంతి విలువ ఏంటో తెల
గౌతమ్ ఆదాని


న్యూఢిల్లీ, 24 జూన్ (హి.స.)

ఆపరేషన్ సిందూర్, అహ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ గుర్తుచేసుకున్నారు. అదానీ ఎంటర్ప్రైజెస్ వార్షిక సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ కు శాంతి విలువ ఏంటో తెలుసు అని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సాయుధ దళాలకు అదానీ సెల్యూట్ చేశారు.

ఇక ఆపరేషన్ సిందూర్లో అదానీ డిఫెన్స్ డ్రోన్లు కూడా భాగమయ్యాయని తెలిపారు. యాంటీ డ్రోన్ వ్యవస్థలు మన దళాలను, పౌరులను రక్షించడంలో సహాయపడ్డాయని చెప్పారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో మన బలగాలు అత్యంత ధైర్యసాహసాలు కనబరిచాయని కొనియాడారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande