ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు మృతి
విశాఖపట్నం , 24 జూన్ (హి.స.)విశాఖపట్నం జిల్లాలో సోమవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లంకెలపాలెం వద్ద కారును లారీ ఢీ కొట్టగా.. కారులో ఉన్న ఆరుగురు మృతి చెందారు. పలువురికి గాయాలవ్వగా.. స్
ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు మృతి


విశాఖపట్నం , 24 జూన్ (హి.స.)విశాఖపట్నం జిల్లాలో సోమవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లంకెలపాలెం వద్ద కారును లారీ ఢీ కొట్టగా.. కారులో ఉన్న ఆరుగురు మృతి చెందారు. పలువురికి గాయాలవ్వగా.. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టంకు పంపారు. కాగా.. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో పలు వాహనాలు కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande