హైదరాబాద్, 14 మే (హి.స.)
ఓ భవన నిర్మాణంలో పిల్లర్ గుంతలో పడి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయి సంఘటన ఉప్పల్ లో చోటు చేసుకుంది. మృతి చెందిన బాలురు అర్జున్ (8) , మణికంఠ (15)గా గుర్తించారు. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి కుటుంబంతోపాటు వలస వచ్చి ఉప్పల్లోని కుర్మానగర్లో నివాసం ఉంటున్నారు.చిన్నారుల తల్లిదండ్రులు అక్కడే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేసుకుంటే జీవనం కొనసాగిస్తున్నారు. ఇద్దరు చిన్నారులు మంగళవారం సాయంత్రం నుంచి కనిపించక పోవటంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కుటుంబసభ్యుల ఇచ్చిన ఫిర్యాదులో మిస్సింగ్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు రాత్రి నుండి గాలింపు చేపట్టగా బుధవారం ఉదయం భాగాయత్లో కుల సంఘాల భవన నిర్మాణానికి కేటాయించిన స్థలంలో తవ్విన పిల్లర్ గుంతలో అర్జున్, మణికంఠ మృతదేహాలు లభ్యమైనవి..
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..