నా ఫోన్ కూడా యాప్ అయి ఉండవచ్చు : బీజేపీ ఎంపీ లక్ష్మణ్
హైదరాబాద్, 25 జూన్ (హి.స.) బీజేపీ రాజ్యసభ సభ్యుడు, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేడు బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్.. తన ఫోన్ కూడా ట్యాప్ చే
బిజెపి ఎంపీ లక్ష్మణ్


హైదరాబాద్, 25 జూన్ (హి.స.)

బీజేపీ రాజ్యసభ సభ్యుడు, జాతీయ

ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేడు బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్.. తన ఫోన్ కూడా ట్యాప్ చేయబడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యంగా 2016-2020 మధ్య తాను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగి ఉండవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ, సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో ఉంటే ఈ విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థకు బదిలీ చేయాలని సవాలు విసిరారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఈ అక్రమ ఫోన్ ట్యాపింగ్లో రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేయబడ్డాయని, ఇది జాతీయ భద్రతకు ముప్పు కలిగించే ఘటన అని మండిపడ్డారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande